వీసా రెడ్డి ఎవరిని టార్గెట్ చేసారు?
Vijayasai Reddy about Prashna Raavan and Prakash Raj issue
విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ నుంచి బయటికొచ్చి ఇంకా ఏ పార్టీలో చేరకుండా సోలో స్టేటస్ ని మైంటైన్ చేస్తున్నారు. లిక్కర్ కుంభకోణం లో విజయసాయిరెడ్డి పలుమార్లు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అపుడప్పుడు రాజకీయాలను కెలుకుతూ వ్యవసాయం చేసుకుంటున్న విజయసాయి రెడ్డి తాజాగా యూట్యూబర్ రావణ్ అరెస్ట్, అలాగే మీడియాలో హడావిడి చేస్తున్న ప్రకాష్ రాజ్ ల విషయంపై స్పందిస్తూ వారికి సపోర్ట్ చేస్తున్న వైసీపీ నేతలను టార్గెట్ చేసారు.
విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా..
రావణ్లు, ప్రకాశ్ రాజ్లు ఎక్కడినుంచి పుట్టుకు వస్తున్నారు?
వీరికి మద్దతు ఇస్తున్నది ఎవరు?
వీరు ఏ సంస్కృతికి వారసులు?
వీరి తండ్రులు, తాతలు ఎవరు? వీరి మూలాలు ఎక్కడున్నాయి?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి.
హిందూ సోదరులు, నిజమైన భారతీయ దేశభక్తి భావాలు కలిగిన వారు కొన్ని విషయాల్ని గమనించాలి...
ఓసీల్లో ప్రధానంగా రెండు అధికార కులాల నుంచి కొద్దిమంది, కన్వర్ట్ అయిన వారు కన్వర్ట్ అయిన తరవాత కూడా, వారి కులాన్ని వదిలిపెట్టకుండా పేరు చివర కులాన్ని తగిలించుకుని వేరే మత వ్యవస్థల్ని నడిపిస్తూ ఆర్థికంగా, అధికార పరంగా, రాజకీయంగా లాభాలు పొందుతున్నారన్నది అందరూ గమనించాలి(రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మతంలో సగం కన్నా ఎక్కువ మంది పాస్టర్లు మతం మార్చుకున్న రెడ్లు కమ్మ వారే)
అత్యంత గొప్పదైన మన భారతీయ సంస్కృతిమీద, మన దేవతలమీద, మన హిందూ మతం మీద, మన దేశం మీద ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు, ఏ కులానికి, ఏ మతానికి చెందినవారు చేసినా - ఇటు సమాజం బుద్ది చెప్పాలి అటు చట్టం–అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి యావజ్జీవం లేక ఉరి శిక్ష విధించాలి. అవసరమైతే ప్రభుత్వం చట్టాల్ని సవరించాలి. ఆ వ్యాఖ్యల్ని సమర్థించేవారికి కూడా అదే స్థాయిలో గుణపాఠం నేర్పాలి.
బలవంతపు మత మార్పిడుల్ని, ప్రలోభాల ద్వారా మత మార్పిడుల్ని సమర్థించటం... మన సంస్కృతిమీద, మన దేశ సార్వభౌమత్వం మీద నల్ల కళ్లద్దాలు, సూట్ బూటు ధరించి మైక్ పట్టుకుని సగం వచ్చి రాని ఇంగ్లీష్ లో మిగతా తెలుగులో ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దాడి చేయటం కొందరికి ఫ్యాషన్గా హీరోయిజంగా మారింది.
ఇలా ఒక పథకం ప్రకారం, తమ ఆర్థిక లాభం కోసం మతం మారిన ఓసీ కులాల్లోని కొన్ని కుటుంబాల వారు... మన దేశానికి, హిందూ మతానికి వ్యతిరేకంగా కన్వర్ట్ అయిన మిగతా కులాల వారితో విషం కక్కించే కార్యక్రమాన్ని తెర వెనక ఉండి నడిపిస్తున్న విషయాన్ని గమనించాలి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరుగా రావణ్ని, ప్రకాశ్రాజ్ను సమర్థించటం, హైలైట్ చేయటం అంటే, ఇది నేరుగా మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద, మన దేవతల మీద, మన దేశం మీద వారు చేస్తున్న దాడి మాత్రమే.
హైందవ సమాజాన్ని, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ఇలాంటి ఆలోచనల్ని మతపరమైన ఉగ్రవాదంగా భావించాలి. చట్టం వేసే శిక్షలతోపాటు సమాజం కూడా వీరందరినీ వెలివేయాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు కేంద్రంలో అధికారపార్టీ బీజేపీ ఈ దేశద్రోహం, సంఘ విద్రోహ కుట్రల మీద చట్టపరంగా అన్ని చర్యలూ తీసుకోవాలి.. అంటూ రావణ్ ను, ప్రకాష్ రాజ్ ను సపోర్ట్ చేస్తున్నవారిని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసారు.







































