ఎట్టకేలకు నిర్మాతగా మారిన మహేష్‌...!

CineJosh news

మహేష్‌బాబు త్వరలో నిర్మాతగా మారుతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి.. నిజమే... మహేష్‌బాబు తాజాగా తాను కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీమంతుడు’ చిత్రం ద్వారా నిర్మాతగా మారిపోయాడు. మైత్రి మూవీస్‌ బేనర్‌తో పాటు మహేష్‌బాబుకు చెందిన జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పేరుతో మహేష్‌ నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. ‘శ్రీమంతుడు’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ మీద మహేష్‌ నిర్మాణ సంస్థకు సంబంధించిన లోగో కూడా ఉండటం గమనార్హం. దీంతో మహేష్‌ నిర్మాణ సంస్థ ఈ సినిమాతోనే లాంచ్‌ అయినట్లయింది. మరి హీరోగా ఉన్నత శిఖరాలు అధిరోహించిన మహేష్‌ నిర్మాతగా  ఏ స్థాయికి చేరతాడో చూడాలి....!

mahesh babu
koratala siva
sreemanthudu
maithri mmovies