ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> International Yoga Day celebrated grandly in AP

APలో గ్రాండ్ గా అంతర్జాతీయ యోగా దినోత్సవం

International Yoga Day celebrated grandly in AP


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు జూన్ 21 ఆదివారం విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యోగ గురువు రాందేవ్,  పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యోగా గురు బాబా రాందేవ్‌ తో కలిసి ముఖ్యమంత్రి యోగాభ్యసనాలు చేశారు. నగర వాసులు పెద్ద ఎత్తున యోగా కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మట్లాడుతూ..

•    ప్రశాంత వాతావరణంలో యోగా గురువు రామ్ దేవ్ బాబాతో కలిసి యోగాభ్యాసం చేయడం ఎన్నటికీ మరువలేను.
•    యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు.
•    ప్రధాని మోదీ ప్రపంచానికి భారత దేశ శక్తిని చాటుతున్నారు...  దేశాన్ని అగ్రభాగాన నిలుపుతున్నారు.
•    ప్రధాని చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
•    ప్రపంచానికి భారత్ విశ్వగురు... ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగేది భారత దేశం.
•    ఫిజికల్, మెంటల్ ఫిట్ నెస్ పెంచేది యోగానే.
•    యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్ దేవ్ బాబా కృషి అమోఘం.
•    సాంకేతికత.. ఆధ్యాత్మికత కాంబినేషన్ తో వెళ్తేనే భవిష్యత్.
•    ఆథ్యాత్మికత, యోగా సాధనతో హెల్తీ, వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యం.
•    ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్ సాధించేందుకు కృషి చేద్దాం
•    యోగాంధ్ర-2025లో విశాఖలో నిర్వహించి రికార్డులు సృష్టించాం.
•    ప్రధాని మోదీ సమక్షంలో గిన్నిస్ రికార్డులు, ప్రపంచ రికార్డులు సాధించాం.
•    వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తాం.
•    1.33 లక్షల సెంటర్లల్లో కోటి మందికి పైగా యోగా సాధన చేస్తున్నారు.
•    ఇంటింటికి యోగా చేరాలి... ప్రజారోగ్యం బాగుండాలి.. ఇదే ప్రభుత్వ లక్ష్యం.
•    స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు  నిర్మిస్తాం.
•    యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయి అధికారులను నియమిస్తాం.
•    స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్స్ రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తాం.
•    యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తాం. 
•    జంక్ ఫుడ్ వద్దు.. ఫాస్ట్ ఫుడ్ ను దూరంగా పెడదాం.
•    ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్నాం... రసాయన రహిత ఆహారాన్ని స్వీకరిస్తే అనారోగ్యం దరి చేరదు.
•    రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతాం.
•    సంజీవని ప్రాజెక్టును ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.
•    వైద్య నిపుణులను ప్రజలకు చేరువ చేస్తాం... సంజీవనిలో యోగాను చేరుస్తాం.
•    రోజుకో గంట యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయాలి.. ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరమే రాదు.

AP CM Chandrababu Naidu, Baba Ramdev lead 12th International Yoga Day celebrations in Vijayawada