జగన్ ను కలిసినా పవన్ ఆలా అనుకోడు

కొద్దీ రోజుల క్రితం మెగా స్టార్ చిరంజీవి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలిశారు. అయితే ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారు అన్నది బయటకి చెప్పలేదు, కానీ చాలామంది చాల రకాలుగా అనుకున్నారు వారిద్దరూ భేటీ గురించి. కొందరు అయితే చిరంజీవి వెళ్లి కలవటం అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ ని అవమాన పర్చటమే అని, వారిద్దరి మధ్య ఇంకా చిచ్చు రగులుకుంటుందని ఏవేవో అంటున్నారు, రాస్తున్నారు. కానీ ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ నవ్వుకుంటున్నారట.
ఎందుకంటే ఇలా అనుకునే వాళ్ళు చాలా నిరాశ పడతారని. ఎందుకంటే చిరంజీవి ఏమి చేసిన, ఎవరిని కలిసిన పవన్ కళ్యాణ్ ఏమి అనుకోరు. అతనికి తెలుసు చిరంజీవి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ని కలిసారో. రాజకీయ దృక్పథాలు ఇద్దరివీ వేరైనా, వాళ్లిద్దరూ అన్నదమ్ములు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అంతే గాని ఇద్దరు మాటకు మాట అనుకోరు. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ కి ఎప్పుడూ అభిమానమే, గౌరవం కూడా. అందుకే సభలో అయినా, ఫంక్షన్స్ అటెండ్ అయ్యినా, ఎంతోమందిని విమర్శించినా, ఎప్పుడూ, ఎన్నడూ తన అన్న చిరంజీవి ని పవన్ విమర్శించలేదు. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఎదో వుంది అనుకోవటం అజ్ఞానమే. వాళ్ళిద్దరి మధ్య వున్నది అన్నదమ్ముల అనుబంధమే తప్ప రాజకీయ బంధం కాదు.
Chiranjeevi met Andhra Pradesh Chief Minister Jaganmohan Reddy
Chiranjeevi met Jaganmohan Reddy






































