యంగ్‌టైగర్‌ కి అక్కడ హయ్యస్ట్‌ ఎమోంట్‌!

ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా, మోహన్‌లాల్‌ కీలకపాత్రలో సమంత, నిత్యామీనన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'జనతాగ్యారేజ్‌' చిత్రం సెప్టెంబర్‌1న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. ఎన్టీఆర్‌, కొరటాలను చూసి తెలుగులో..., మోహన్‌లాల్‌, నిత్యామీనన్‌, ఉన్నిముకుందన్‌ను చూసి మలయాళ మార్కెట్‌లో ఈ చిత్రానికి భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారీగా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరుపుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని ఒరిస్సాతో పాటు నార్త్‌ఇండియా డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు కూడా భారీ ధరకే అమ్ముడయ్యాయని సమాచారం. ఈ హక్కులను రూ.65 లక్షలకు డిస్ట్రిబ్యూషన్‌ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ రేటుకి ఆ హక్కులు అమ్ముడుకావడం ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్‌ ఎమోంట్‌ అంటున్నారు. కాగా ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయ్యింది. మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా మైత్రి మూవీస్‌ అధినేతలు భారీగా మొదలుపెట్టారు. దాదాపు మరో వారం పాటు ఈ చిత్ర పబ్లిసిటీ విషయంలో హోరెత్తించేలా ప్లాన్‌ చేశారు నిర్మాతలు. మరి ఈ చిత్రం ఎన్టీఆర్‌, కొరటాల శివలకు హ్యాట్రిక్‌ను అందిస్తుందేమో వేచి చూడాల్సివుంది. 

janatha garage
north india
jr ntr
koratala siva
janatha garage business
Advertisement
Advertisement