త్రివిక్రమ్ కి 'నో' చెప్పిన పవన్..!

త్రివిక్రమ్, అల్లుఅర్జున్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'సన్ ఆఫ్ సత్యమూర్తి'. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 15 న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుంది. ఈ ఆడియో వేడుకకు పవన్ కళ్యాన్ హాజరవనున్నట్లు వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ కి పవన్ కళ్యాన్ కు మధ్య ఉన్న స్నేహం వల్ల పవన్ ఖచ్చితంగా ఆడియోను ఆవిష్కరిస్తాడని అంతా అనుకున్నారు. దీంతో పవన్ కు మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయని మెగాభిమానులు ఆశించారు. కానీ తాజాగా పవన్ త్రివిక్రమ్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులలో  పవన్ ఆడియో వేడుకకు హాజరవ్వడం మంచిది కాదని భావించాడట. దీంతో గ్రాండ్ గా చేయాలనుకున్న వేడుకను సింపుల్ గా పలువురు సినీ సెలబ్రిటీస్ సమక్షంలో హైదరాబాద్ నోవెటల్ హోటల్ లో చేయనున్నారని సమాచారం. 

trivikram
allu arjun
pawan kalyan
audio function
Advertisement
Advertisement