వెంకయ్యపై పక్షపాతిగా ముద్ర పడుతుందా..??

తెలంగాణ, ఏపీల మధ్య ఎమ్సెట్‌ వివాదం ముగియడం లేదు. ఓ మెట్టు దిగడానికి రెండు రాష్ట్రాలు ససేమిరా అనడంతో ఇంటర్‌ విద్యార్థుల భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. మరోవైపు ఈ వివాదానికి తెరదించడానికి గవర్నర్‌ నరసింహన్‌ చేస్తున్న ప్రయత్నాలు కూడా కొలిక్కిరావడం లేదు. ఈ తరుణంలో ఎమ్సెట్‌ విషయమై కేంద్రం జోక్యం తప్పనిసరిగా మారింది. కాని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయమై మధ్యవర్తిత్వం వహించడానికి అంగీకరించడం లేదు. ఢిల్లీలో వెంకయ్యను ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కలుసుకోగా ఈ మేరకు స్పష్టం చేశాడు. గవర్నర్‌ మధ్యవర్తిత్వంతోనే సమస్యను పరిష్కరించుకోవాలని, తాను కూడా ఈ విషయమై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడినట్టు స్పష్టం చేశారు. అయితే ఈ విషయమై తాను జోక్యం చేసుకున్నా.. టీ-సర్కారు ఆయన ప్రతిపాదనలకు ఒప్పుకోదని, ఆయనపై ఏపీ పక్షపాతిగా ముద్ర వేస్తుందన్న అనుమానాలతోనే వెంకయ్య మధ్యవర్తిత్వానికి అంగీకరించనట్లు రాజకీయవర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.

central minister venkaiah naidu
venkaiah naidu vs kcr
eamcet
apvs telangana government
eamcet controvercy between ap
telangana
governer narasimhan about eamcet controversy