సాక్షి ఛానల్ లో అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని పై, జర్నలిస్ట్ కృష్ణం రాజు పై మహిళల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి కొమ్మినేని శ్రీనివాస్ ను హైదరాబాద్ లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా మహిళలు సాక్షి ఆఫీస్ ముందు శాంతియుతంగా ధర్నాలు చెయ్యగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలను సైకోలు చిత్రీకరిస్తూ కామెంట్స్ చెయ్యడంతో తీవ్ర దుమారం చెలరేగింది.
ఏపీ వ్యాప్తంగా సాక్షి ఛానల్ లో అమరావతి మహిళలపై చేసిన నీచమైన కామెంట్స్ పై జనాగ్రహం పెల్లుబికితే.. దాన్ని ఉపయోగించుకుని ఇప్పుడు ఏలూరులో సాక్షి ఆఫీస్ కి తమ సొంతవారి చేతే నిప్పు పెట్టించి ఆ నిందను టీడీపీపై, అమరావతి మహిళలపై మోపుతున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్.
ఏలూరు లో సాక్షి కార్యాలయాన్ని టీడీపీ కార్యకర్తలే దగ్ధం చేసారు అంటూ జగన్ కొత్త నాటకానికి తెర లేపడమే కాదు.. ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలను కూడా మాయం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. అమరావతి మహిళపై చేసిన వ్యాఖ్యలు డైవర్ట్ చేయటం కోసం, తెలుగుదేశం ఒక సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాలను పండుగలుగా చేయాలని తలపెట్టిన కార్యక్రమాన్ని డైవర్స్ చేయటం కోసమే కొత్త కుట్రలకు జగన్ తెర లేపారు అంటున్నారు.
గతంలో ఇదే తరహాలో తాడేపల్లి జగన్ నివాసం వద్ద వైసీపీ వారే నిప్పు పెట్టి అది టీడీపీ వాళ్లే చేసారు అంటూ టీడీపీ మీదకు తొయ్యలని ప్రయత్నంచెయ్యడమే కాదు అప్పుడు తాడేపల్లి కేసులో తన ఇంటి బయట సీసీ ఫోటేజ్ కూడా ఇవ్వకుండా జగన్ అండ్ కో మాయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏలూరులోని అదే మాదిరి ఘటన రిపీట్ అయ్యింది.