రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న మోహన్ బాబు

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజుకి లక్షలాది పాజిటివ్ కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే 45 ఏళ్ల పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేయిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. మే 1 నుంచి అందరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానుంది. సినీ సెలబ్రిటీలు సైతం కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇటీవల తిరుపతిలో మొదటి డోస్ తీసుకున్న కలెక్షన్ కింగ్ మోహన్బాబు తాజాగా రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేశారు. రెండో డోస్ వ్యాక్సిన్ పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కులు ధరించండి అని మోహన్ బాబు ట్వీట్ చేశారు.
Mohan Babu gets the second dose of Covid-19 vaccination
Mohan Babu gets the second dose of Covid-19 vaccination







































