రాజమౌళి దృశ్యం 2 రివ్యూ

మలయాళంలో మోహన్ లా హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఫిబ్రవరి 19 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన దృశ్యం 2 విమర్శకుల నుండి ప్రశంశలు పొందింది. జీతూ జోసెఫ్ మేకింగ్ స్టయిల్, మోహన్ లాల్ నటనకు ప్రేక్షకులు ఫిదా.. దృశ్యం 2 బ్లాక్ బస్టర్ అవడంతో మోహన్ లాల్ దృశ్యం చిత్రాన్ని రీమేక్ చేసిన టాలీవుడ్ సీనియర్ హీరో వెంకీ వెంటనే దృశ్యం 2 మూవీ రీమక్స్ రైట్స్ కొనెయ్యడం.. ఆ సినిమాని తెలుగులో మొదలు పెట్టడం అన్ని చాలా ఫాస్ట్ గా జరిగిపోయాయి. అయితే దృశ్యం 2 రిలీజ్ అయ్యాక సెలబ్రిటీస్ ఆ సినిమాపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

అయితే రీసెంట్ గా దృశ్యం 2 సినిమాకి సౌత్ టాప్ డైరెక్టర్ రాజమౌళి రివ్యూ ఇవ్వడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. రాజమౌళి దృశ్యం 2 మూవీ చూసి.. తాజాగా ఆ సినిమాకి రివ్యూ ఇవ్వడం అందరిని ఆకర్షించింది. అంతేకాకుండా దృశ్యం డైరెక్టర్ జీతూ జోసెఫ్ కి రాజమౌళి వాట్సాప్ సందేశం పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ వాట్స్ అప్ చాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డియర్ జీతూ.. నేను డైరెక్టర్ రాజమౌళిని. మీరు డైరెక్ట్ చేసిన దృశ్యం 2 కొన్నాళ్ల క్రితమే చూసాను. ఆ సినిమా చూసాక నా ఆలోచనలన్నీ ఆ సినిమా చుట్టే తిరిగాయి. మళ్ళీ వెంటనే దృశ్యం మొదటి సినిమా చూసాను. దర్శకత్వం దగ్గరనుండి.. ఎడిటింగ్, యాక్టింగ్.. ఇలా ప్రతి టెక్నీకల్ విభాగం అన్ని అద్భుతం. వరల్డ్ వైడ్ స్థాయిలో ఉంది దృశ్యం కథ. దృశ్యం అనేది ఓ మాస్టర్ పీస్. అదే ప్రమాణాలతో దృశ్యం 2 తీసుకురావడం నిజంగా అభినందించదగ్గ విషయం. అది చాలా గొప్ప విషయం. మీనుండి మరికొన్ని మాస్టర్ పీస్ లు రావాలని కోరుకుంటున్నా అంటూ రాజమౌళి జీతూ జోసెఫ్ కి పంపిన వాట్స్ అప్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Rajamouli bowled over by Mohanlal Drishyam 2

Rajamouli reviews Mohanlal Drishyam 2
rajamouli
mohanlal
jeeethu josef
drishyam 2
rajamouli review
tollywood top director. drishyam 2 master pies