ఇంకా ఫిదా అవుతూనే ఉన్నారు...!

మెగాహీరో వరుణ్తేజ్కి మొదటి కమర్షియల్ సక్సెస్ని అందించిన చిత్రం 'ఫిదా'. ఈ చిత్రంతో వరుణ్తేజ్ కంటే సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఫామ్ కోల్పోయాడని భావిస్తోన్న శేఖర్కమ్ముల ఈ చిత్రంతో మరలా ఫామ్లోకి వచ్చాడు. ఇక దిల్రాజుకి కూడా ఈ చిత్రం లాభాల వర్షం కురిపించింది.
ఇక విషయానికి వస్తే 'ఫిదా' చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. ఓవర్సీస్లోనే భారీ విజయాన్ని కైవశం చేసుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసిన ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాలలో ఒకటిగా నిలిచిందని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు. అమెరికాలో పెరిగిన అబ్బాయిగా వరుణ్తేజ్, తెలంగాణ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన యువతిగా సాయిపల్లవిలు ప్రేక్షకులను ఫిదా చేశారు. ఈ సినిమాలో 'వచ్చిండే పిల్లా మెల్ల మెల్లగా వచ్చిండే. క్రీమ్ బిస్కెట్ వేసిండే.. గమ్మున కూసోనియ్యాడే.. కుదురుగా నిల్సోనీయడే' పాట అద్భుతమైన రెస్సాన్స్ని సొంతం చేసుకుంది. ఈ విశేష జనాదరణ పొందిన ఈ గీతం ఇప్పటికీ పలు స్టేజీ షోలపైనా, ఫంక్షన్లలలో వినిపిస్తూనే ఉంటుంది. యూట్యూబ్లో ఇప్పటి వరకు ఈ పాటను 15మిలియన్ల మంది అంటే 15కోట్ల మందికి పైగా వీక్షించారని, ఫేస్బుక్ ద్వారా దర్శకుడు శేఖర్కమ్ముల ఆనందం వ్యక్తం చేశాడు.
150మిలియన్ల వీక్షకులను దాటిని తొలి తెలుగు పాట ఇదే. అద్భుతమైన స్పందనకు మీకు ధన్యవాదాలు.. ఈ మ్యాజిక్లో భాగమైన 'ఫిదా' టీంకి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు అని శేఖర్కమ్ముల తెలిపాడు. ఓ మంచి మెలోడీ, మనదైన పాటకి ఎంతటి గుర్తింపు వస్తుందో 'రంగస్థలం'లోని 'రంగమ్మత్తా...', 'ఫిదా'లోని 'వచ్చిండే పిల్లా మెల్లమెల్లగా వచ్చిండే' పాటలకు లభిస్తున్న స్పందనే తెలియజేస్తోంది.
Vachinde song from Fidaa creates record with 150 million views
Vachinde song from Fidaa clocks 150 million views






































