Advertisement

పూరి కోసం మెగాస్టార్‌ వస్తున్నాడు.!

టెంపర్‌ తర్వాత చాలా సినిమాలు కమిట్‌ అయి ఒక్కొక్కటిగా కంప్లీట్‌ చేసుకుంటూ వస్తున్న పూరి జగన్నాథ్‌ తన లేటెస్ట్‌ మూవీ ‘జ్యోతిలక్ష్మీ’ ఆడియో ఫంక్షన్‌ను రేపు(జూన్‌4) హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో చాలా గ్రాండ్‌గా చెయ్యబోతున్నాడు. ఈ ఫంక్షన్‌కి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. తన 150వ సినిమాని డైరెక్ట్‌ చేస్తున్న పూరి కోసం మెగాస్టార్‌ ఈ ఫంక్షన్‌కి అటెండ్‌ అవుతారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌, సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ ఇటీవల విడుదలై హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమాకి బిజినెస్‌పరంగా కూడా చాలా క్రేజ్‌ వచ్చింది. సి.కళ్యాణ్‌కి ఇది చాలా ప్రాఫిట్‌ ప్రాజెక్ట్‌ అవుతుందని ట్రేడ్‌ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే అన్ని ఏరియాల బిజినెస్‌ని కంప్లీట్‌ చేసారని సమాచారం. జూన్‌ 12న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాడు నిర్మాత సి.కళ్యాణ్‌. 

puri jagannath movie jyothi lakshmi
charmi as jyothi lakshmi
c.kalyan
jyothi lakshmi movie on 12th june