ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
చాలాకాలం తర్వాత వస్తున్న మనీషా!

మనీషాకోయిరాలా... నాగార్జున సరసన ‘క్రిమినల్’ మణిరత్నం దర్శకత్వంలో ‘ముంబై’ వంటి చిత్రాల్లో నటించి దక్షిణాది ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న నటి. తాజాగా ఆమె మరో దక్షిణాది చిత్రంలో నటిస్తోంది. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడిన ఆమె ఇప్పుడు అనారోగ్యం నుండి తేరుకొని కమల్హాసన్ సరసన మరో చిత్రం చేయాలని ఆశిస్తున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పింది. అడిగిందే తడవుగా కమల్హాసన్ తాను తమిళ, తెలుగు భాషల్లో చేస్తున్న ‘తూంగావనం’ (చీకటిరాజ్యం) చిత్రంలో చిన్న పాత్రే అయినప్పటికీ ఎంతో కీలకమైన పాత్ర చేస్తోందిట. ఈ పాత్ర కమల్కు భార్యగా అని సమాచారం. ఈమె మరిన్ని చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాలని కోరుకుందాం...!
manisha koirala
kriminal
baobay
kamalhasan
cheekati rajyam movie
manisha reentry







































