మహేష్ సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసింది..!

అప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'ఐస్ క్రీమ్' సినిమాతో హీరోయిన్ గా మెరిసింది నటి తేజస్వి. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' సినిమాలో నాక్కొంచెం కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఓ గ్రూప్ కూడా మెయిన్టైన్ చేస్తున్న అంటూ మహేష్ తో సందడి చేసింది. ఇప్పుడు మరల మహేష్ బాబు సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది.

మహేష్ నటిస్తున్న 'శ్రీమంతుడు' సినిమాలో గెస్ట్ రోల్ కోసం తేజస్వి ని ఎన్నుకున్నారట. ఇటీవల ఆమెకు సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ 'మహేష్ తో మరో అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఆయనతో ఇప్పుడు నటించడం కూడా కొత్తగా ఉందంటూ' చెప్పుకొచ్చింది.

tejaswi
maheshbabu
seethmmavakitlo sirimallechettu
sreemanthudu