Advertisement

హమ్మయ్య.. బెయిల్‌ దొరికింది..!!

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. ముప్పై రోజులపాటు జైలు జీవితం గడిపిన రేవంత్‌రెడ్డి ఎట్టకేలకు బయటకు రానున్నాడు. అయితే రేవంత్‌రెడ్డి బెయిల్‌పై తెలంగాణ ఏజీ చేసిన వాదనలను కోర్టు పట్టించుకోలేదు. రూ. 5 కోట్లకు సంబంధించి ఈ డీల్‌లో మిగిలిన రూ. 4.50 కోట్ల గురించి తేలాల్సి ఉందని, అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి మరో ముద్దాయి మత్తయ్య పరారీలో ఉన్నందునా రేవంత్‌కు బెయిల్‌ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందని కూడా ఏజీ వాదించారు. అయితే ఈ వాదనలను తోసిపుచ్చిన న్యాయమూర్తి రేవంత్‌కు బెయిల్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. రేవంత్‌కు బెయిల్‌ ఇవ్వడానికి కోర్టు పలు కండీషన్లు పెట్టింది. బెయిల్‌ కోసం రూ. 5 లక్షల పూచికత్తు సమర్పించాల్సి ఉంటుందని, పాస్‌పోర్టు సరేండర్‌ చేయాలని, కోడంగల్‌, హైదరాబాద్‌లో మాత్రమే ఉండాలని, బయటకు వెళ్లవద్దని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఇక ఇదే కేసులో అరెస్టు అయిన ఇతర నిందితులు సెబాస్టియన్‌, ఉదయ్‌సింహాలకు కూడా కోర్టు బెయిల్‌ మంజూరుచేసింది.
revanth reddy
bail
voteki note
conditions