ఉత్తరాదిన అమితాబ్‌, దక్షిణాదిన మెగా ఫ్యామ్లీ..!

నేపాల్‌ భూకంప బాధితులను ఆదుకోవడానికి పిలుపునిచ్చిన ‘బిగ్‌ బి’ అమితాబ్‌ వలె తెలుగులో ముందుకొచ్చింది రామ్‌ చరణ్‌, దగ్గుబాటి రానా. ఈ ఒక్కసారేకాదు గతంలోనూ హుదూద్‌ తుపాను బాధితుల సహాయనిధికి మెగా ఫ్యామ్లీ ముందుగా స్పందించింది. నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ పొరుగు దేశాలయినా మన గోత్రీకులేనన్న భావన భారతీయులలో నరనరాన జీర్ణించుకుపోయింది. హుదూద్‌ తుపాను బాధితుల సహాయ నిధికి తెలంగాణ ఎంత గొప్పగా స్పందించిందో అంత గొప్పగా బాలీవుడ్‌ తారలు స్పందించారు. దు:ఖానికి కులం, మతం, ప్రాంతం, దేశంతో ప్రమేయంలేదంటూ మానవతా దృక్పధంతో స్పందించిన రామ్‌ చరణ్‌, రానా ద్వయానికి అభినందనలు.

amitabh bacchan
ram charan
rana
nepal
srilanka