ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత తెలుగు దర్శకులను పక్కనపెట్టి కోలీవుడ్ దర్శకులతో కమిట్ అవుతున్నారు. AA 22 రాకా చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో చేస్తున్న అల్లు అర్జున్ ఆతర్వాత త్రివిక్రమ్ సినిమాని పక్కనపెట్టి మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో AA 23 ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసారు. కూలి చిత్రంతో డిజప్పాయింట్ చేసిన లోకేష్ తో అల్లు అర్జున్ జట్టు కట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
లోకేష్ కనగరాజ్ ఎలాంటి కథ తో అల్లు అర్జున్ ని ఇంప్రెస్స్ చేసారో తెలియదు కానీ.. ఈప్రాజెక్టు గ్లోబల్ స్థాయిలో ఉండబోతుంది అంటూ.. రైటర్ రత్నకుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. AA 23 ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు, ఇందులోని నటీనటులు, వారి పాత్రలు, సెట్స్ ను చూసి నేను ఈ మాట చెప్పడం లేదు. ఇది గ్లోబల్ స్థాయిలో మెప్పించేంత గొప్ప కథ అంటూ రత్నకుమార్ ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేసాడు.
అల్లు అర్జున్ తో లోకేష్ కనగరాజ్ చేసే ఈ ప్రాజెక్ట్ కోసం మూడు వారాల పాటు చర్చలు జరిగాయి. అల్లు అర్జున్ తో మాట్లాడడం మా టీమ్ కి ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. మే రెండో వారం నుంచి పనులు మరింత వేగవంతం కానున్నాయి.. త్వరలోనే AA 23 షూటింగ్ మొదలు కాబోతుంది అంటూ రత్నకుమార్ అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పై బిగ్ అప్ డేట్ అందించారు.




కవిత సక్సెస్ ని డిసైడ్ చేసే సభ 
Loading..