మెగా హీరో వరుణ్ తేజ్ తన చెల్లెలు నిర్మాత నిహారిక నిర్మిస్తున్న బరి చిత్రం కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడంతో మోకాలికి దెబ్బ తగిలింది. దానితో చిత్ర బృందం వరుణ్ తేజ్ ని హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించిగా.. అపోలో వైద్యులు వరుణ్ తేజ్ కి సర్జరీ చేసారు. దానితో వరుణ్ తేజ్ కి కొద్దిరోజులు రెస్ట్ అవసరమని డాక్టర్స్ సూచించిన విషయం తెలిసిందే.
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ త్వరగా కోలుకొవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసారు.
యువ కథానాయకుడు వరుణ్ తేజ్ బరి సినిమా కోసం చేస్తున్న ప్రాక్టీసులో గాయపడ్డారని తెలిసింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న వరుణ్ తేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. వైద్యులు, ఫిజియోల సూచనలు పాటిస్తూ కోలుకొని, కెమెరా ముందుకు రావాలి.
పవన్ కళ్యాణ్




దేవర 2 ఇప్పుడప్పుడే లేనట్లే 
Loading..