ప్రస్తుతం ఇరాన్ వార్ తో ఇండియా లోని గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. ముడి చమురు నిల్వలు తగ్గిపోవడంతో LPG గ్యాస్ ధరలకు రెక్కలు వచ్చాయి. వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోయింది. గతంలో 50 నుంచి 70 రోజులు వరకు గ్యాస్ ని నిరంతరం సరఫరా చేసే వీలు ఉంది అన్నా ఇప్పుడు పది రోజులకే ఆ నిల్వలు తగ్గిపోవడంతో గృహ సంబంధిత LPG గ్యాస్ కోసం వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తున్నారు.
ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరమైన బెంగుళూరులో ఈ వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో అక్కడి రెస్టారెంట్స్ యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్యాస్ సరఫరా పూర్తిగా ఆగిపోయింది. దానితో ఈరోజు నుండి హోటళ్లను నడపడం అసాధ్యం. మేము సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని బెంగుళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.
కేవలం ఒక్క బెంగుళూరు మాత్రమే కాదు.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. దానితో రేపటినుంచి హోటళ్లు, రెస్టారెంట్స్ బిజినెస్ LPG గ్యాస్ కొరత వల్ల మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి.
మరి హోటల్స్ మూతబడితే బ్యాచిలర్స్ పరిస్థితి ఏమిటి. వారు ఏ విధంగా మహా నగరాల్లో సర్వైవ్ అవుతారు, ఎన్నాళ్ళు ఈ LPG గ్యాస్ కొరత ఉంటుంది అనే విషయంలో సోషల్ మీడియాలో అనేకరకాల చర్చలు జరుగుతున్నాయి.




పెద్ది బిజినెస్ మైండ్ బ్లోయింగ్ 

Loading..