అవును మహేష్ బాబు ఫ్యాన్స్ #GlobeGallanthuCheddam అంటూ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. నవంబర్ 15 న హైదరాబాద్ లో జరగబోయే #Globetrotter ఈవెంట్ విషయంలో మహేష్ అభిమానులు ఎంత క్రేజీగా ఉన్నారో సోషల్ మీడియా X లో ట్రెండ్ అవుతున్న #GlobeGallanthuCheddam హ్యాష్ ట్యాగ్ చూస్తే అర్ధమవుతుంది.
మహేష్ బాబు-ప్రియాంక చోప్రా కలయికలో రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB -29 ఈవెంట్ కోసం చాలా ఎక్కువగా అందరూ వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి ఈ ఈవెంట్ హక్కులను జియో హాట్ స్టార్ కి ఇవ్వడం, ఈ ఈవెంట్ కోసం మేకర్స్ తో కోట్లు పెట్టించడం వెనుక బిగ్ ప్లాన్ ఉంది అని, దీని డిజిటల్ రైట్స్ తోనే రాజమౌళి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారని తెలుస్తుంది.
ఆ ఈవెంట్ లో ఓ 3 మినిట్స్ గ్లింప్స్ ని వదులుతారనే టాక్ నడుస్తుంది. పృథ్వీ రాజ్ సుకుమార్ విలన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈవెంట్ కి హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారనే విషయంలో మహేష్ ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు. అందుకే గ్లొబ్ గల్లంతు చేద్దాం అంటూ పూనకాలతో ఊగిపోతున్నారు.




చివరికి ఈమెతోను స్టార్ హీరో బ్రేకప్

Loading..