బెల్లంకొండ శ్రీనివాస్-అనుపమ పరమేశ్వరన్ ల లేటెస్ట్ మూవీ కిష్కిందపురి. భైరవం తర్వాత మంచి అంచనాల నడుమ విడుదలైన కిష్కిందపురికి ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. సెప్టెంబర్ 12 న మిరాయ్ తో పోటీ పడిన ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ అవడంతో నిర్మాతలు సేఫ్ అయ్యారు.
థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా ఆడిన కిష్కిందపురి చిత్ర డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE 5 ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. అయితే కిష్కిందపురికి థియేటర్స్ లో సో సో టాక్ రావడంతో ఈ చిత్రం మూడు వారాలు తిరిగేలోపు ఓటీటీకి లోకి వచ్చేస్తుంది అనుకున్నారు.
తాజాగా ZEE 5 అండ్ మరో ఓటీటీ సంస్థ OTT ప్లే నుంచి అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. థియేటర్స్ లో సెప్టెంబర్ 12 న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోకి అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతుంది అన్నమాట.