యంగ్ టైగర్ ఎన్టీఆర్-కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో మార్చ్ లో మొదలై జెట్ స్పీడు తో షూటింగ్ జరుపుకుంటున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్)ఫస్ట్ లుక్ మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కి రావాల్సింది కానీ.. అప్పుడు వార్ 2 నుంచి స్పెషల్ టీజర్ రావడంతో డ్రాగన్ సర్ ప్రైజ్ ని నీల్ పోస్ట్ పోన్ చేసారు.
అదాలఉంటే క్రేజీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ భారీ పారితోషికం తో పాటుగా ఆయన లాభాల్లో 50 పర్సెంట్ షేర్ నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ని అడిగినట్లుగా తెలుస్తుంది. డ్రాగన్ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్-మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
KGF సిరీస్, అలాగే సలార్ బిగ్గెస్ట్ హిట్స్ అవడంతో ప్రశాంత్ నీల్ డిమాండ్ కూడా పెరిగింది అని, ప్రశాంత్ నీల్ అడిగింది ఇవ్వడానికి మైత్రి వారు సిద్దమని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం లో ఎన్టీఆర్ మాస్ అవతార్ లో అభిమానులకు సర్ ప్రైజ్ ట్రీట్ ఇస్తారని, ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది అనే ప్రచారం ఉంది. డ్రాగన్ మూవీని నీల్ జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.