ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ram Charan mobbed at Delhi airport after OSCARS win

ఢిల్లీలో రామ్ చరణ్-మోడీతో మీటింగ్

Ram Charan mobbed at Delhi airport after OSCARS win

ఆస్కార్ వచ్చాక ఎన్టీఆర్ రెండు రోజుల క్రితమే హైదరాబాద్ కి చేరుకున్నారు. అభిమానూలు ఘన స్వాగంతంతో తడిచి ముద్దయ్యారు. ఇక ఈ రోజు శుక్రవారం రాజమౌళి, కీరవాణి ఫామిలీస్ హైదరాబాద్ కి ఆస్కార్ తో సహా అడుగుపెట్టారు. వారంతా విజయ్ గర్వంతో కనిపించారు. జైహింద్ అంటూ ఎయిర్పోర్ట్ నుండి మరేమి మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మరో హీరో రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు తర్వాత నేరుగా హైదరాబాద్ కి రాకుండా ఆయన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ మీడియాతో మట్లాడారు. 

నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉంది. నాటు నాటు సాంగ్ ఇప్పుడు అందరిదీ. ఒక తెలుగు పాటకి ఆస్కార్ రావడం చాలా గర్వకారణంగా ఉంది. ఆస్కార్ రావడం చాలా సంతోషం. అందరికి పేరు పేరునా ధన్యవాదాలు అన్నారు. రామ్ చరణ్ ఈ రోజు సాయంత్రం మోడీని కలబోతున్నారు. 

ఆస్కార్ తర్వాత రామ్ చరణ్ ఢిల్లీ వెళ్లి అక్కడ ప్రధాని మోడీని కలిసి తర్వాత హైదరాబాద్ కి రానున్నారు. మరి రామ్ చరణ్ హైదరాబాద్ కి చేరుకోగానే ఎయిర్ పోర్ట్ లో ఆయన అభిమానులు ఎంత హంగామా చేస్తారో చూడాలి. 

Ram Charan as he arrives at the Delhi Airport

ram charan
delhi airport