పెళ్లి తర్వాత క్రేజ్ పెరిగిందా?

పెళ్లి చేసుకుంది.. నయనతార కెరీర్ అయ్యిపోయింది.. విగ్నేష్ ని వివాహం చేసుకున్నాక నయనతార కి అవకాశాలే రావు అనుకుంటే.. ఈ లేడీ సూపర్ స్టార్ కి అవకాశాలు క్యూ కట్టడమే కాదు, పెళ్లి తర్వాత పారితోషకం పెంచి షాకిచ్చింది అంటూ కోలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం షారుఖ్ తో అట్లీ దర్శకత్వంలో జవాన్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమాకి నయనతార 8 నుండి 9 కోట్లు వరకు పారితోషకం తీసుకుంటుంది అంటున్నారు.
కానీ నయనతార కెరీర్ లో 75 వ చిత్రంగా జీ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో చెయ్యబోయే చిత్రానికి 10 కోట్లు డిమాండ్ చేసింది అని తెలుస్తుంది. ఆ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడంతోనే నయన్ అంత డిమాండ్ చేసింది అని.. ఇప్పటివరకు 7 కోట్లు వరకు పారితోషకం అందుకుంటున్న నయనతార అట్లీ మూవీ బాలీవుడ్ మూవీ కావడంతో ఆ సినిమాకే ఎక్కువ రెన్యుమరేషన్ తీసుకుంటుంది అంటే.. ఇప్పుడు 75 వ చిత్రానికి మరింతగా పెంచేసింది నయన్ అంటున్నారు. మరి పెళ్ళికి ముందు కన్నా పెళ్లి తర్వాతే నయనతార డిమాండ్, క్రేజ్ పెరిగాయా.. అందుకే నయన్ పారితోషకం అంత పెంచింది అంటున్నారు. ఇదే నిజమైతే నయన్ కి విగ్నేష్ తో వివాహం కలిసొచ్చినట్టే.
Nayanthara demand 10 cr for Nayan75
Nayanthara Huge Remuneration For Nayan75







































