శిల్ప చౌదరి కేసులో.. మహేష్ సోదరి

మాయ లేడీ శిల్పా చౌదరిపై హైదరాబాద్ లో వరసగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. సెలబ్రిటీస్, బడా ఫామిలీస్ నుండి కోట్లలో అప్పులు తీసుకుని.. వాటిని ఎగ్గొట్టిన కేసులో శిల్పా చౌదరిని ఇప్పటికే పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. శిల్పా చౌదరి సంపన్న కుటుంబాలకు గాలం వేసి.. కిట్టి పార్టీల పేరుతొ.. అధిక వడ్డీలకి డబ్బు తీసుకుని.. మెహర్బానీలకు పోయి.. చివరికి ఆ అప్పులు కట్టకపోవడంతో బాధితులు ఒక్కొక్కరిగా పోలీస్ లకు కంప్లైంట్ చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో సూపర్ స్టార్ మహేష్ సోదరి పేరు రావడం అందరికి షాక్ ఇచ్చింది. మహేష్ సిస్టర్, సుధీర్ బాబు వైఫ్ ప్రియదర్శిని కూడా శిల్పా చౌదరిపై కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
కిట్టి పార్టీల పేరుతొ తన దగ్గర 2.90 కోట్లు అప్పు తీసుకుని.. వడ్డీ కట్టడం అటుంచి అసలు కూడా కట్టకుండా తనని ఇబ్బందులకు గురి చేస్తుంది అని, శిల్ప చౌదరి.. కిట్టి పార్టీలు, పర్సనల్ పార్టీలు అంటూ అందరిని మోసం చేసింది అంటూ మహేష్ బాబు సోదరి, సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని ఆమెపై కేసు పెట్టింది. ప్రియదర్శిని కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు మరోసారి శిల్పా చౌదరి ని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. దానితో ఇప్పడు శిల్పా చౌదరి ఈకేసులో.. ఇంకెంతమంది సెలబ్రిటీస్ పేర్లు వినిపిస్తాయి అంటూ అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.
Priyadarshini files a police complaint against Shilpa Chowdary
Mahesh Babu sister Priyadarshini files a police complaint







































