గంటల వ్యవధిలో దేవిశ్రీ ఫ్యామిలిలో విషాదం

కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ చాలామంది ప్రముఖ వ్యక్తులని కోల్పోయింది. మధ్యలో కొన్ని కారణాలతో కొంతమంది సినిమా ప్రముఖులు కన్ను మూసారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఫ్యామిలిలో కొన్ని గంటల వ్యవధిలోనే వరస విషాదాలు చోటు చేసుకున్నాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు దేవిశ్రీ ఫ్యామిలీ మెంబెర్స్ చనిపోవడం దేవీశ్రీ ఫ్యామిలీని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. దేవి శ్రీ ప్రసాద్ బాబాయ్ బుల్గానిన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
అయితే దేవిశ్రీ బాబాయ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారని విషయం తెలిసిన వెంటనే దేవిశ్రీ ప్రసాద్ మేనత్త సీతామహాలక్ష్మి గుండెపోటుతో మృతి చెందడం ఆ కుటుంబాన్ని కోలుకోలేని విషాదంలో ముంచెత్తింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబంలోని ఇద్దరిని కోల్పోవడంతో దేవిశ్రీ ప్రసాద్ ఫ్యామిలీ కన్నీరుమున్నీరు అవుతుంది. విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు దేవిశ్రీ ప్రసాద్ కుటుంబానికి తమ సంతాపం తెలియజేస్తున్నారు.
Devi Sri Prasad house tragedy
Two tragic incidents happened in Music director Devi Sri prasad family






































