గోవా పని పూర్తి చేసిన సర్కారు వారి పాట

సెకండ్ వేవ్ కరోనా తగ్గుముఖం పట్టాక.. మహేష్ బాబు - పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట రెస్యూమ్ షూటింగ్ హైదరాబాద్ లోనే ప్రారంభమైంది. మహేష్ బాబు సినిమాలోని కీలక పాత్రధారులు ప్రకాష్ రాజ్ హీరోయిన్ కీర్తి సురేష్ తదితర తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ తర్వాత టీం మొత్తం గోవాకి పయనమైంది. గోవా లో మహేష్, విలన్స్ గా నటిస్తున్న వారిపై యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసేసింది టీం. గోవాలో ఓ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించారు. ప్రత్యేకంగా వేసిన ఓ భారీ సెట్లో... రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో ఆ యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించారు. దానితో గోవా షెడ్యూల్ పూర్తయ్యి టీం హైదరాబాద్ కి పయనమైనట్టుగా తెలుస్తుంది.
ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట గోవా షెడ్యూల్ కి కుటుంబ సమేతంగా వెళ్లిన విషయం తెలిసిందే. భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార లతో కలిసి మహేష్ గోవాలో ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా సర్కారు వారి పాట గోవా షెడ్యూల్ పూర్తవడంతో టీం తో పాటు మహేష్ కూడా తన ఫ్యామిలీతో హైదరాబాద్ కి పయనమైనట్టుగా తెలుస్తుంది.
Sarkaru Vaari Paata Goa secrets revealed
All about Sarkaru Vaari Paata Goan schedule







































