మహేష్ -ప్రభాస్ లతో సై అంటున్న పవన్

కరోనా సెకండ్ వేవ్ తో సినిమా రిలీజ్ డేట్స్ అనుకున్న టైం కి కాకుండా.. వేరే న్యూ రిలీజ్ డేట్స్ తో ముందుకు వస్తున్నారు హీరోలు. అందులో ముందుగా ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ని జులై 30 నుండి జనవరి 14 2022 సంక్రాంతి కి ఫిక్స్ చేసేసాడు. సినిమా షూటింగ్ మొదలైనప్పుడే మహేష్ బాబు సర్కారు వారి పాట 2022 సంక్రాంతి కి ఫిక్స్ చేసారు. ఇక పవన్ - క్రిష్ హరిహర వీరమల్లు కూడా 2022 సంక్రాంతి కి అన్నా.. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేక ఆ సినిమా వేసవికి ఫిక్స్ అయ్యేలా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ - రానా అయ్యప్పన్ కోషియం రీమేక్ ని సంక్రాంతి బరిలోకి దింపబోతున్నారని అన్నారు కానీ.. కన్ ఫర్మ్ చెయ్యలేదు.
తాజగా ఏకే రీమేక్ టీం తమ భీమ్లా నాయక్ ని 2022 జనవరి12 న రిలీజ్ డేట్ చెయ్యబోతున్నట్టుగా అఫీషియల్ గా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర అయ్యప్పన్ కోషియం రీమేక్ తెరకెక్కిస్తున్నాడు. త్రివిక్రమ్ హాండ్స్ నుండి తెరకెక్కుతున్న ఈ సినిమా రెస్యూమ్ షూట్ తాజాగానే మొదలైంది. మరి అందరూ సంక్రాంతి మీద కచ్చిఫ్ వెయ్యకముందే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని సంక్రాంతి కి ఇచ్చేసారు. మహేష్ బాబు - ప్రభాస్ కి పోటీగా పవన్ కళ్యాణ్ కూడా 2022 సంక్రాంతికి తన సినిమాని ఫిక్స్ చేసాడు.
Pawan Kalyan, Rana film release date announced
Pawan Kalyan, Rana film joins Sankranthi race







































