పోలీస్ లకి అడ్డంగా చిక్కిన ప్రేమ జంట

ప్రస్తుతం దేశం లోని పలు రాష్ట్రాలలో లాక్ డౌన్, కర్ఫ్యూలు అంటూ ప్రజలు ఇంట్లో నుండి బయటికి రాకూండా సడలింపు టైం లోనే బయటికి వచ్చి పనులు ముగించుకుని ఇళ్ళకి చేరుకుంటున్నారు. కానీ లాక్ డౌన్ టైం లో రోడ్స్ మీద తిరిగే వారి పని పోలీస్ లు పడుతున్నారు. బైక్స్, కార్లు సీజ్ చెయ్యడం యంగ్ స్టర్స్ కి పోలీస్ ల కౌన్సిలింగ్ లాంటివి ఇవ్వడం చూస్తూనే ఉన్నాము. అయితే రీసెంట్ గా మహారాష్ట్రలో కర్ఫ్యూ అమలవుతున్న టైం లో ముంబై లో ఓ సెలెబ్రిటీ ప్రేమికుల జంట రోడ్ మీద షికార్లు కొట్టడానికి వెళ్లి పోలీస్ లకి అడ్డంగా దొరికిపోయింది.
బాలీవుడ్ లో ప్రేమికుల జంటగా ఫోకస్ అయిన టైగర్ ష్రాఫ్ - దిశా పటాని లు జిమ్ లో వర్కౌట్స్ చేసి.. కాసేపు అలా తిరిగి వద్దామని షికార్లు కొడుతూ పోలీస్ లకి చిక్కడం, వారు లాక్ డౌన్ వేళ బయట కనిపించారన్న ఆరోపణలతో టైగర్ - దిశా లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. కారణం లేకుండా బయటికి వచ్చి, లాక్ డౌన్ నియమావళిని అతిక్రమించారంటూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దానితో ఈ రోజు ఉదయం నుండి దిశా పటాని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అయితే టైగర్ తల్లి మాత్రం లాక్ డౌన్ వేళ ఎవరూ కావాలని బయటికి వెళ్ళరు.. వారు ఇంటికి వస్తుంటే వాళ్ళని అపి పోలీస్ లు ప్రశ్నించారు .. కేసు నమోదు చేసేముందు ముందు విచారించాలి అంటూ కొడుక్కు వత్తాసు పలకడం హాట్ టాపిక్ గా మారింది.
Mumbai Police confirms FIR against Disha Patani-Tiger Shroff with an epic tweet
Tiger Shroff, Disha Patani car ride got interrupted by the police







































