ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kona Venkat revealed about Nissabdam release

ఎట్టకేలకు కోనవెంకట్ చెప్పేశాడు...

భాగమతి వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ నిశ్శబ్దం ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి. ఒకప్పటి హీరో మాధవన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. పూర్తిగా అమెరికాలో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిమ్ కార్పోరేషన్ బ్యానర్ పై కోనవెంకట్ నిర్మాతగా తెరకెక్కించారు. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

కరోనా లాక్డౌన్ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో ఓటీటీ నుండీ నిశ్శబ్దం చిత్ర నిర్మాతకి భారీ ఆఫర్ వచ్చిందని, మరికొద్దిరోజుల్లో అమెజాన్ ప్రైమ్ లో రానుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై చిత్ర దర్శకుడు కూడా వయా మీడియా పాలసీని అనుసరించడంతో నిశ్శబ్దానికి ఇక ఓటీటీనే ఏకైక ఛాయిస్ అనుకున్నారు.

కానీ ఈ చిత్రాన్ని డైరెక్టుగా థియేటర్లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు కోనవెంకట్ తెలిపాడు. కోన వెంకట్ ట్వీట్ చేస్తూ, మేమంతా సినిమా ఇండస్ట్రీకి ఎంతో ఇష్టపడి వచ్చాం. ఎంతో కష్టపడి ఇక్కడ నిలదొక్కుకున్నాం . సినిమాలు రూపొందించేది థియేటర్లలో చూడడానికే. అక్కడ రిలీజ్ చేస్తేనే మాకు ఆనందం కలుగుతుంది. అదే మాకు అతిపెద్ద ఆక్సిజన్ లా పనిచేస్తుంది. సినిమా అంటే థియేటరే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ దెబ్బతో నిశ్శబ్దం ఓటీటీలో వస్తుందన్న వార్తలకి ఫుల్ స్టాప్ పడనుంది.

Konavenkat revealed about Nissabda release

Kona Venkat revealed about Nissabdam release
kona venkat
anushka shetty
anjali
shalini pandey
madhavan
hemanth madhukar
Advertisement
Advertisement