బాలీవుడ్ కదిలింది.. బాద్ షా ముందుకు వచ్చాడు..

ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని ఎలా బయటపడాలా అని దాంతో యుద్ధం చేస్తున్న సమయంలో ఒక్కొక్కరుగా కదిలి వస్తున్నారు. ఈ ఆపత్కాల సమయంలో ప్రజల్ని ఆదుకోవడానికి, ప్రభుత్వాలకి సాయం చేయడానికి వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, సినిమా సెలెబ్రిటీలు కదిలి వస్తున్నారు.ఈ విషయంలో టాలీవుడ్ హీరోలు కాస్త ముందస్తుగానే స్పందించిన సంగతి తెలిసిందే.
అయితే రోజు రోజుకీ సమస్య తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రతో ఒక్కరూ కదిలి వస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ౨౫ కోట్ల విరాళం ప్రకటించగా సల్మాన్ ఖాన్ కూడా వచ్చాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే ఫౌండేషన్ ద్వారా సేవాకార్యక్రమాలు చేస్తాడని తెలిసిందే. సినీ కార్మికుల కోసం తనవంతు సాయం చేస్తున్నాడు. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయిస్ కి తన వంతు సాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు.
ఈ ఫౌండేషన్ ద్వారా ఇరవై ఐదు వేల కార్మికుల బాగోగులు చూసుకుంటాడట.సల్మాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Salman khan announced his help
bollywood baadshah,, announced his help






































