సాయికి మెగా బ్రదర్స్ ప్రోత్సాహం..!

సందీప్ కిషన్ హీరోగా రెజీనా హీరోయిన్గా సాయి ధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న కృష్ణ వంశీ చిత్రం 'నక్షత్రం' ఇక వెలుగు చూడదేమోనని అందరూ నిరుత్సాహపడుతున్న వేళ ఈ చిత్రం ఆడియో తాజాగా విడుదలైంది. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ, తాను 'గోవిందుడు అందరివాడేలే' షూటింగ్ స్పాట్కి వెళ్లినప్పుడు కృష్ణవంశీ గారితో మీ చిత్రంలో ఓ పాత్ర ఉంటే ఇవ్వమని కోరాను. ఆయన నా కలను ఇంత త్వరగా నెరవేరుస్తారని భావించలేదు.
ఇందులో పవర్ఫుల్గా ఉండే అలెగ్జాండర్ అనే పాత్రను పోషించాను. కృష్ణవంశీగారి దర్శకత్వంలో ఓ చిత్రంలో చేస్తున్నానని చెప్పగానే మా మావయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్లు నాకు ఆల్ది బెస్ట్ చెప్పారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో నటిస్తున్నావంటే ఆయన నుంచి నటనలో ఎంతో నేర్చుకోవచ్చని చిరంజీవి మావయ్య చెప్పారు.. అన్నాడు.ఇక ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్తో పాటు ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తాజాగా విడుదల చేసిన 'లాయిరే.. లాయిరే' అనే సాంగ్ ప్రోమోలో కృష్ణవంశీ తనదైన మార్క్ చూపించాడు.
హీరోయిన్లను అందంగా చూపించడంలో రాఘవేంద్రరావు, పెద్ద వంశీల తర్వాత తానేనని ఈ పాటతో ఆయన నిరూపించాడు. ఈ చిత్రంలో కృష్ణవంశీ టేకింగ్కితోడు రెజీనా అందాల ఆరబోత, కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్ చూస్తే ఎవరైనా అటే చూస్తు ఉండిపోవాల్సిందే అనిపిస్తోంది.ఇక పాట ప్రోమోనే అలా ఉంటే ఇక వెండితెరపై పూర్తి పాటలతో పాటు అన్ని పాటలు ప్రేక్షకులను ఏ విధంగా అల్లరిస్తాయో చూచాయగా అర్ధమవుతోంది.
Sai Dharam Tej acted movie Nakshatram this movie audio released on yesterday 5th july in this audio function sai dharam tej speaking about mega brothers Chiranjeevi and Pawan kalyan.
Sai Dharam Tej Speaking About Mega Brothers Chiru and Pawan






































