కేసీఆర్ తర్వాత రేవంత్రెడ్డేనట...!

ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ హవా నడుస్తోంది. పాలనలో ఎన్ని లోపాలున్నా, విపక్షాలు ఎంతగా మొత్తుకుంటున్నా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా తాము కేసీఆర్నే ముఖ్యమంత్రిగా చూడాలని ఎక్కువ మంది తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అనే వాదన ఎప్పటినుంచో వినిపిస్తోంది. తాజాగా ఓ సర్వే కూడా ఇదే విషయాన్ని తేల్చిచెప్పింది.
ఇక కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్రావు వంటి వారికి తెలంగాణలో మంచి పేరుందని, కాబోయే సీఎం కేటీఆర్ అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక ఈ ఇద్దరు మంచి హార్డ్ వర్కర్లే కాకుండా మంచి పరిపాలనాధ్యక్షులుగా కూడా నిరూపించుకుంటున్నారు. కానీ ఈ తాజా సర్వేలో ఓ ఆసక్తికర విషయం వెలుగుజూసింది. కేసీఆర్ తర్వాత తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్బ్రాండ్గా పేరున్న రేవంత్రెడ్డిని అత్యధికులు సీఎంగా చూడాలని భావిస్తుండటం విశేషం.
ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పలువురు భావిస్తూ వచ్చారు. కానీ ఈ సర్వే అలాంటిదేమీ లేదని తేల్చింది. టీఆర్ఎస్ తర్వాత ఎక్కువ మంది కాంగ్రెస్, నెక్ట్స్ టిడిపి, తర్వాత బిజెపికి మద్దతు తెలిపారు. ఇక రేవంత్తో పోల్చుకుంటే ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి, కిషన్రెడ్డి, లక్ష్మన్లు కూడా వ్యక్తిగత ఫాలోయింగ్ విషయంలో చాలా వెనుకబడి ఉండటం విశేషం.
A latest survey on the public pulse in Telangana State, conducted by Bengaluru-based Political Quotient has indicated that a majority of the people prefer the ruling TRS and Chief Minister K. Chandrasekhar Rao in 2019 the elections.
After KCR, Revanth Reddy is top choice for Telangana CM








































