Advertisement

ఆసక్తిని రేపుతోన్న నారా చిత్రం..!

Thu 29th Dec 2016 03:45 PM
nara rohith,sri vishnu,director sagar k chandra,appatlo okadundevadu movie  ఆసక్తిని రేపుతోన్న నారా చిత్రం..!
ఆసక్తిని రేపుతోన్న నారా చిత్రం..!
Advertisement

నారా రోహిత్‌ సమర్పణలో, ఆయనే హీరోగా, శ్రీవిష్ణు మరో ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం 'అప్పట్లో ఒక్కడుండేవాడు'చిత్రం రేపు విడుదల కానుంది. వాస్తవిక సంఘటనలు, పాత్రల స్ఫూర్తితో ఈ చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. తన తొలి చిత్రాన్నే 'అయ్యారే....' వంటి టిపికన్‌, నేచురల్‌ సబ్జెక్ట్‌తో సంచలనం సృష్టించిన సాగర్‌ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇందులో ఇంతియాజ్‌ అనే పోలీసాఫీసర్‌ పాత్రలో రోహిత్‌, క్రికెటర్‌ రాజు పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్నారు. ఈ చిత్రంలో ధుర్యోధనుని పాత్రను పోలిన పాత్రను నారా రోహిత్‌, కర్ణుడిలా అన్నీ మంచి లక్షణాలే ఉన్నా ఎక్కడో తేడా అనిపించే కర్ణుడి తరహా పాత్రలో శ్రీవిష్ణు నటించారని దర్శకుడు చెబుతున్నాడు. అయితే పురాణంలో వీరిద్దరు స్నేహితులైతే, ఈ చిత్రంలో మాత్రం ఇద్దరు విరోధులుగా కనిపించనున్నారట. 

ఇక ఈ చిత్రంలో పలు వాస్తవిక సంఘటనలు చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఎన్‌కౌంటర్‌కు గురైన గ్యాంగ్‌స్టర్‌ నయూమ్‌, ఆయన హత్య చేశాడని భావిస్తున్న ప్రజాగాయని లలితక్కల పాత్రలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయని సమాచారం. అలాగే రెండు దశాబ్దాల కిందట తెల్గీ చేసిన స్టాంపుల కుంభకోణం, భోగాపురం దొంగల నిజజీవితాలు, వారి వెనుక ఉండే రాజకీయనాయకులు, క్రికెటర్‌గా బాగా ఎదుగుతాడనుకున్న ఓ హైదరాబాదీ క్రికెటర్‌ కెరీర్‌ నాశనం కావడానికి కారణాలు, 1990లలో ఓ మాజీ ముఖ్యమంత్రి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మతాల మధ్య గొడవలు పెట్టిన వైనం.. ఇలా పలు వాస్తవ ఘటనలకు ఇందులో తెరతీశారని తెలుస్తోంది. ఇవే నిజమైతే ఈ చిత్రం సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement