Advertisement

డ్రస్ తెచ్చిన తంటా, రాఖీసావంత్ పై కేసు

సంచలనం కోసమో, ప్రత్యేక ఆకర్షణ కోసమో చేసే పనులు ఒక్కోసారి వివాదం అవుతాయి. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ విషయంలో ఇదే జరిగింది. ఆగస్టులో అమెరికాలో పర్యటించినపుడు భారత ప్రధాని మోడీ బొమ్మలతో ఉన్న డ్రస్ ధరించింది. అసలే సెక్సీ నటికావడంతో ఆమె వేసుకున్న డ్రస్ పై అందరి దృష్టి నిలిచింది. ఇదే ఇప్పుడు వివాదమై పోలీస్ కేసు వరకు వెళ్ళింది. 

రాఖీసావంత్ వేసుకున్న డ్రస్ వల్ల ప్రధానికి అవమానం జరిగిందంటూ ఒక న్యాయవాది జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

బాలీవుడ్ స్టార్స్ ధరించే దుస్తులపై ఉండే చిత్రమైన బొమ్మలు, వ్యాఖ్యలు తరచూ వివాదస్పదం అవుతున్నాయి. ఒక్కోసారి వివాదం వారికి ప్రచారాన్ని సైతం తెచ్చిపెడుతోంది. 

rakhi sawant
modi dress
controversy
police case