Advertisement

పాక్‌కి బుద్ది చెప్పాలంటున్న నెటిజన్లు!

జమ్ముకాశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌పై దాడి చేసి చేసిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు నెటిజన్లు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ విషయంలో నెటిజన్లు పాక్‌పై మండిపడుతున్నారు. భారత్‌ తన పూర్తి ఆయుధ సంపత్తితో పాక్‌పై దాడి చేయాలని దాదాపు 67శాతం నెటిజన్లు కోరుతున్నారు. ఇక అంతర్జాతీయంగా పాక్‌ని ఏకాకిని చేయాలని దాదాపు 25శాతం నెటిజన్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌తో యుద్దం ప్రమాదకరమని 4.6శాతం మంది అభిప్రాయపడుతుండగా, పాక్‌ను కట్టడి చేయాలని ఈ విషయంలో ఖచ్చితంగా భారత్‌.. పాక్‌ను ఘాటుగా హెచ్చరించాలని 3.6 శాతం మంది కోరుతున్నారు. నెటిజన్లతో పాటు భారతలోని సామాన్య ప్రజల అభిప్రాయం కూడా పాక్‌తో యుద్దం చేయాలనే వారే ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. 

bharat
army
pakistan
uri sector
india
bjp