Advertisement

చరణ్ 'ధృవ' లానే కళ్యాణ్ రామ్ 'ఇజం'!

ప్రస్తుతం నందమూరి కళ్యాణ్‌రామ్‌ స్వీయ నిర్మాణంలో తానే హీరోగా పూరీజగన్నాద్‌తో చేస్తున్న చిత్రం 'ఇజం'. కాగా ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్‌29న రిలీజ్‌ చేయాలని భావించారు. కానీ ఆ తర్వాత దసరా కానుకగా అక్టోబర్‌7న విడుదల అవుతుందని మాట ఇచ్చారు. అయితే ఈ చిత్రం దసరాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇటీవలే ఈ చిత్రం రషెష్‌ చూసిన కళ్యాణ్‌రామ్‌, పూరీలకు ఇందులోని కొన్ని సీన్స్‌ బాగా రాలేదని అనిపించడంతో.. అసంతృప్తిని కలిగించిన సీన్స్‌ను మరలా రీషూట్‌ చేయనున్నారు. మొత్తానికి యూనిట్‌ను నిరాశపరిచిన ఈ సన్నివేశాలు తిరిగి రీషూట్‌ అవసరం కావడంతో ఈ చిత్రం దసరాకు కాకుండా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సేమ్ ఇదే విధంగా రామ్ చరణ్ నటిస్తున్న 'ధృవ' కూడా పోస్ట్ పోన్ అయినా విషయం తెలిసిందే. 

ram charan
dhruva
kalyan ram
ism
re shoot