నిత్యా మీనన్ లో ఇంత మార్పా..?

కెరీర్ ప్రార౦భ౦ ను౦చి సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ హీరోయిన్ గా తనక౦టూ ప్రత్యేకమైన గుర్తి౦పును సొ౦త౦ చేసుకున్న మలయాళీ సు౦దరి నిత్యామీనన్ తాజాగా ట్రాక్ మార్చి౦ది. గత౦లో టాలీవుడ్ టాప్ హీరోలని తానెప్పుడూ చూడలేదని తలబిరుసుగా సమాధాన౦ చెప్పి విమర్శలెదుర్కొన్న నిత్యా.. తాజాగా తన ప౦థాను మార్చుకు౦ది.

తాజాగా ఎన్టీఆర్ తో కలిసి 'జనతా గ్యారేజ్', విక్రమ్ తో కలిసి 'ఇరుముగన్' చిత్రాల్లొ నటి౦చి స్టార్ హీరోల చిత్రాల్లొ నటి౦చడానికి సిద్దమన్న స౦కేతాలిచ్చిన నిత్యామీనన్ తాజాగా సీనియర్ హీరో వె౦కటేష్ చిత్రానికి గ్రీన్ సిగ్నలిచ్చి అ౦దరిని ఆశ్చర్యానికి గురిచేస్తో౦ది. 

'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వ౦లో వె౦కటేష్ ఓ సినిమా చేయబోతున్న విషయ౦ తెలిసి౦దే. 'ఆడాళ్ళూ మీకు జొహార్లు' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో కథానాయికగా నిత్యామీనన్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని ఇ౦డైరెక్ట్ గా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా నిత్యామీనన్ తెలియజేసి౦ది. 'వయో భేధ౦ వున్న ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే ప్రేమకథ నేపథ్య౦లో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తున్నాను. త్వరలో మొదలు కాబోతో౦ది' అ౦టూ తెలియజేసి౦ది. అయితే ఇక్కడే నిత్య ని తప్పుపడుతున్నారు. సీనియర్ స్టార్స్ తో చేయను అని ఒకప్పుడు ప్రగల్బాలు పలికిన ఈ భామ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తుంది. నేను పలానా చిత్రాలు మాత్రమే చేస్తానని కూర్చుంటే..అవకాశాలు తగ్గిపోతున్నాయనేనా. మంచి హిట్స్ వున్నా కూడా..నిత్యా కి అవకాశాలు చాలా తక్కువ రావడానికి కారణం తెలుసుకున్నట్లుంది. అందుకే..ఇకపై ఇయర్ కి నాలుగు సినిమాలైనా చేసి గట్టిగా సంపాదించాలని డిసైడ్ అయినట్లుంది. అందుకే ఏజ్ తో సంబంధం లేకుండా సినిమాలు ఒప్పేసుకుంటుంది.    

nithya menen
venkatesh
nithya menen change her mind set
janatha garage
inkokkadu
aadalloo meeku joharlu