Advertisement

'మనమంతా' మరో రికార్డ్..!

గతవారం రిలీజ్ అయిన 'మనమంతా' చిత్రం ఘన విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాని సాయి కొర్రపాటి నిర్మాణ సారధ్యంలో చంద్రశేఖర్ యేలేటి రూపొందించారు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, గౌతమీ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ముఖ్యంగా 4 పాత్రలు.. వారి వ్యక్తి గత సంఘర్షణ ఆధారంగా తెరకెక్కించాడు దర్శకుడు. అయితే ఈ సినిమా థియేటర్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని రన్ అవుతున్న నేపధ్యంలో ఇండస్ట్రీలోని ప్రముఖులు ప్రశంసలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులకు కళ్ళు చెదిరే రేట్ వచ్చిందని సమాచారం.  తాజాగా అందిన సమాచారం ప్రకారం 'మనమంతా' సినిమాకి 6.80 కోట్లు శాటిలైట్ హక్కులు అమ్ముడు పోయాయని సమాచారం. ఒక చిన్న సినిమాకి ఏకంగా 6.80 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ సినిమా విడుదలైన దగ్గర నుండి పాజిటివ్ టాక్ తో రన్ అవ్వడం వల్లనే ఇంత పెద్దమొత్తం లో శాటిలైట్ హక్కుల ద్వారా రావడానికి కారణం అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

manamantha
manamantha movie satellite rights
maa tv
mohan lal
chandrasekhar yeleti