చిరు వేరు..అల్లు అర్జున్ వేరు!!

'చిరంజీవి మాకు తారు రోడ్డు వేశారు. దానిపై మేము హ్యాపీగా ప్రయాణిస్తున్నాం' అంటూ రెగ్యులర్ గా చెప్పే బన్నీ (అల్లు అర్జున్) వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఇటీవల హరితహారం కార్యక్రమంలో స్టార్స్ అంతా మెుక్కలు నాటారు. చిరంజీవి, బన్నీ విడివిడిగా తమ ఇంటిదగ్గరే నాటారు. ఇలా విడిగా చేయడానికి కారణం ఉందట. బన్నీ మామగారు 'టీఆర్ఎస్' పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గా ఉన్నారు. మెుక్కలు నాటే ప్రోగ్రామ్ లో మామ కూడా పాల్గొన్నాడు. ఆయన సూచనమేరకే హరితహారంలో బన్నీ అండ్ ఫ్యామిలీ పాల్గొన్నారని  అంటున్నారు. చిరంజీవితో కలిసి హరితహారంలో పాల్గొంటే పక్కనే 'టీఆర్ఎస్' కన్వీనర్ గా మామ కూడా పాల్గొంటాడు. దాంతో 'టీఆర్ఎస్' తో కలిసి చిరు మెుక్కలు నాటారని ప్రచారం జరుగుతుంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవికి ఇబ్బంది. అందువల్లే చిరు, బన్నీ జాగ్రత్త పడ్డారని అనుకోవచ్చు. 

chiranjeevi
allu arjun
haritha haram
congress
trs
Advertisement
Advertisement