నాయుడుకి ఇప్పుడు రాముడు సమస్య!

ప్రస్తుతానికి ఏపీ డిజీపీ కేంద్రకార్యాలయం హైదరాబాద్‌లోనే ఉంది. డిజీపీ రాముడు విజయవాడ నుండి హైదరాబాద్‌కు అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తున్నాడు. కాగా ఏపీ రాజధాని అమరావతిలోనో, లేక విజయవాడలోనో డిజీపి కూడా కార్యాలయాన్ని చూసుకోవాలని చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నా కూడా ఈ విషయాన్ని డిజిపి రాముడు లైట్‌గా తీసుకుంటున్నాడు. తాత్కాలిక సచివాలయంలోని ఓ బ్లాక్‌ను తనకు కేటాయిస్తేనే ఏపీకి వస్తానని ఆయన పట్టుబడుతున్నాడు. అంతేగానీ ఎక్కడపడితే అక్కడ డిజీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనని ఆయన స్పష్టం చేస్తున్నాడు. తాత్కాలిక సచివాలయంలోనే తనకు ఓ బ్లాక్‌ కేటాయిస్తే మిగిలిన మంత్రులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటుందనే వాదనను రాముడు వినిపిస్తున్నాడు. కానీ తాత్కాలిక సచివాలయంలో వివిధ ప్రభుత్వ శాఖలకే బ్లాక్‌లు కేటాయిస్తుండటం, ఇప్పటికే అన్ని బ్లాక్‌లు నిండిపోవడంతో రాముడు కోరిక నెరవేరేలా కనిపించడం లేదు. మరి ఈ సమస్యను చంద్రబాబునాయుడు ఎలా పరిష్కరిస్తాడో వేచిచూడాల్సివుంది! 

dgp jv ramudu
chandrababu naidu
andhra pradesh
dgp office