ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
దేవినేనిపై హరీష్దే పైచేయి...!

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదాలు చెలరేగుతూ రెండు రాష్ట్రాలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రెండు రాష్ట్రాల భారీ నీటిపారుదల శాఖామంత్రులకు ఎక్కడలేని ప్రాధాన్యత పెరిగింది. తెలంగాణ మంత్రి హరీష్రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమ ఇప్పుడు ఈ రగడలపై దృష్టిసారించారు. హరీష్రావు చాలా సమర్దుమైన మంత్రి. చూసిరమ్మంటే కాల్చి వచ్చే రకం. ఈ సమావేశాల సందర్భంగా హరీష్ తిరుగులేని వాదన చేసి రివర్బోర్డ్ ఆదేశాలను ప్రస్తుతం పక్కనపెట్టి యథాతధ స్దితినే సాగించాలని కేంద్రం తేల్చిచెప్పేలా చేయగలిగాడు. ఈ విషయంలో దేవినేని ఉమ సరిగ్గా ఏపీ వాదనను వినిపించకపోవడంతోనే ఈ సమస్యలో తెలంగాణ.. పై చేయి సాధించిందని అందరూ భావిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం దేవినేని ఈ విషయంలో అద్భుతంగా పనిచేశాడని కితాబు ఇవ్వడం చూస్తుంటే బాబు పొగడ్తలకు నవ్వురాకమానదు.
devineni uma
harish rao
ap and telangana water issue
center








































