అదిరిపోతున్న 'జనతాగ్యారేజ్‌' బిజినెస్‌...!

టాలీవుడ్‌లో ఉన్న స్టార్‌హీరోలలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇటీవల వరకు కొంత వెనుకబడ్డ విషయం వాస్తవమే. ఆయన కెరీర్‌లో నిన్నటివరకు ఒక్క 50కోట్ల సినిమా కూడా లేదు. కానీ 'నాన్నకుప్రేమతో' చిత్రంతో ఎన్టీఆర్‌ 50కోట్ల మార్క్‌ను అందుకున్నాడు. అయినా కూడా ఈ చిత్రం భారీ బడ్జెట్‌ కారణంగా కేవలం యావరేజ్‌గానే నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో 'జనతాగ్యారేజ్‌' చిత్రం చేస్తున్నాడు. విడుదలకు రెండు నెలల ముందుగానే ఈ చిత్రం ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో సంచలనాలను సృష్టిస్తోంది. కేరళ, కర్నాటక వంటి ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే భారీ మొత్తాలకు బయ్యర్లు సినిమా రైట్స్‌ను తీసుకున్నారు. నైజాంను దిల్‌రాజు ఫ్యాన్సీ రేటుకు రైట్స్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ చిత్రం మిగిలిన ఏరియాల్లో కూడా భారీ బిజినెస్‌ చేస్తోంది. రెస్టాఫ్‌ ఇండియా తప్ప మిగిలిన ఏరియల్లో ఈ చిత్రం ఇప్పటికే 61కోట్ల బిజినెస్ కంప్లీట్‌ చేసింది. ఈ చిత్రం హిట్టయి అందరికీ లాభాలు రావాలంటే కనీసం 80 నుండి 90కోట్లు వసూలు చేయాల్సివుంటుంది. అయితే ఈచిత్రం టీజర్‌ను ఈనెల మూడో వారంలో గానీ, లేదా నాలుగోవారంలో గానీ రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

janatha garage
jr ntr
business
karnataka
kerala
fancy rates
mythri movies