సైన్స్ ఫిక్షన్ జోనర్ లో చెర్రీ..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ నిర్మించబోతోంది. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఉండబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికోసం సుమారుగా డెబ్బై కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని పెట్టడానికి మైత్రి మూవీస్ వారు రెడీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ను విభిన్న పాత్రల్లో చూడడానికి తన అభిమానులు ఇష్టపడుతుంటారు. మరి నిజంగానే చెర్రీ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో నటిస్తే గనుక అభిమానులకు పండుగే. చరణ్ ప్రస్తుతం 'తని ఒరువన్' సినిమా రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత సుకుమార్ సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది..! 

ram charan
sukumar
mythri movies
science fiction film
Advertisement
Advertisement