ఈ హీరోయిన్ కూ వరకట్న భాధలు!

ఇండియాలో వరకట్న వేదింపు మరణాలు ఇంకా ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో రహస్యంగా వరకట్నం ఇచ్చేవారు, తీసుకునేవారు. కానీ ఇప్పుడు అది బహిరంగం అయింది. వరకట్న వ్యవహారం మామూలు ఆడపిల్లలే కాదు హీరోయిన్స్ కూడా అతీతులు కాదన్న విషయం ఈమెను చూస్తేనే అర్థం అవుతుంది. ఆ బాధలను  హీరోయిన్ కరిష్మా కపూర్ కూడా అనుభవించినట్టుంది అందుకే ఆమె భర్త పై కేసు పెట్టి సంచలనం సృష్టించింది. కరిష్మా కపూర్ అప్పట్లో టాప్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న సమయం లోనే సంజయ్ కపూర్ ను వివాహం చేసుకుని కొంత కాలం తరువాత ఇద్దరు విడిపోయారు. వీరు విడిపోయి చాలా కాలమే అయినా ఇప్పుడు అతగాడిపై కేసు పెట్టి అందరికి ఆశ్చర్యం కలిగించింది కరిష్మా. సంజయ్ కపూర్, అతని కుటుంబ సబ్యులపై 498 A 34 సెక్షన్ కింద కేసు నమోదు చేసారు? హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కరిష్మా జీవితంలో కూడా  వరకట్న వేదింపుల సంఘటన ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది !!

dowry
karisma karisma kapoor files
husband sunjay
bollywood heroine