ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
'బ్రహ్మొత్సవం' కూడా అక్కడే...?

తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత సినిమా వాళ్లు కూడా తమ రూటు మార్చారు. అంతకు ముందు దాదాపు అన్ని సినిమాల ఫంక్షన్లు హైదరాబాద్లోనే చేసేవారు. అయితే ఇప్పుడు హైదరాబాద్తో పాటు ఏపీలో కూడా చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆడియో ఫంక్షన్లు విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం వంటి సిటీలలో నిర్వహించారు. తాజాగా మహేష్బాబు నటిస్తోన్న 'బ్రహ్మొత్సవం' ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా హైదరాబాద్లో కాకుండా తిరుపతిలో చేయాలని నిర్ణయించారు. 'బ్రహ్మొత్సవం' అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది తిరుపతి. అందుకే ఈ సినిమా ఆడియో వేడుకను తిరుపతిలో నిర్వహించాలని పివిపి సంస్థ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
mahesh babu
srikanth addala
brahmothsawam movie audio release
thirupathi








































