కష్టపడుతోన్న ఎమ్‌.ఎమ్‌.కీరవాణి!

CineJosh news

రాజమౌళి సోదరుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి తన తాజా చిత్రం ‘బాహుబలి’ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌, రీరికార్డింగ్‌ పని పూర్తి చేసే పనిలో బిజీలో ఉన్నాడు. తాజాగా ఈ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ పూర్తి అయింది. అయితే ఇక్కడో విశేషం ఉంది. టీటీడీ దేవస్థానంకు చెందిన నాద స్వరం విద్వాంసులతో దీన్ని పూర్తి చేశారు. వారిని పిలిపించి వారితో నాద స్వరం చేయించారు. దాంతో డాల్బీ ఆట్మాస్‌లో రీరికార్డింగ్‌ పూర్తి చేసినట్లు అయింది. అందుకు సంబంధించిన ఫొటోని కీరవాణి తన సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌లో పోస్ట్‌ చేశారు. 

keeravani
mm keeravani
bahubali
bahubali music director