ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
‘బాహుబలి’ ఆడియో వేడుక మార్పు ఎవరి వల్ల..?

‘బాహుబలి’ ది బిగినింగ్... చిత్రం ఆడియో ఈనెల 13న తిరుపతిలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మార్పుకు కారణం ఈ చిత్ర సమర్పకుడు రాఘవేంద్రరావు అని సమాచారం. ఆయన ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ మెంబర్గా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనే ఈ మార్పుకు కారణం అని తెలుస్తోంది. ఈ ఆడియో ఈవెంట్ను యువ మీడియా వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలు ఇవే అంటూ కొన్నిపాటలు లీకయ్యాయని చెబుతున్నారు. అయితే ఇవి ఇటీవల విడుదలైన పాటల ట్రాక్ లిస్ట్కు సంబందం లేకుండా ఉన్నాయని, అంచనాలు తగ్గించేందుకు ‘బాహుబలి’ టీమే ఈ విధంగా చేసిందని సమాచారం.
bahubali movie
raghavendrarao
thirupathi
yuva media








































