సీక్వెల్‌ చేస్తామంటోన్న కమల్‌..!

‘నాయకుడు’.. భారత చలన చిత్ర పరిశ్రమలో మరపురాని మరిచిపోలేని ఓ కళాఖండం. మణిరత్నం`కమల్‌హాసన్‌ల కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని ఎవ్వరూ ఎప్పటికీ మరిచిపోలేరు. కాగా దీనికి సీక్వెల్‌ చేయాలని ఉందని కమల్‌హాసన్‌ తన మనసులోని మాటను వెల్లడిరచాడు. నేను ఎక్కడికి వెళ్లినా మరలా ‘నాయకుడు’లాంటి చిత్రాన్ని ఎప్పుడు చేస్తారు? అని అందరూ అడుగుతున్నారు. ఈ చిత్రం నాపైనే కాదు.. ప్రేక్షకులందరి మీద చెరగని ముద్ర వేసి అందరిపై తీవ్ర ప్రభావం చూపింది. మరలా అలాంటి శక్తివంతమైన స్టోరీ లభిస్తే నేను, మణిరత్నం ఇద్దరం కలిసి పనిచేస్తాం. త్వరలోనే అది పట్టాలెక్కుతుందని భావిస్తున్నాను.. అంటున్నాడు లోకనాయకుడు. 
kamal hassan
maniratnam
nayakudu movie
sequel