చంద్రబాబును యంగ్‌టైగర్‌ ‘ఢీ' కొంటాడా!

తమిళంలో మురుగదాస్‌ దర్శకత్వంలో విజయ్‌, సమంత జంటగా నటించిన ‘కత్తి’ చిత్రం తమిళనాట ఘనవిజయం సాధించింది. దీని డబ్బింగ్‌, రీమేక్‌ రైట్స్‌ను నిర్మాత ఠాగూర్‌ మధు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్‌ చేయాలని భావించినప్పటికీ ఆ తర్వాత తెలుగులో టాప్‌స్టార్స్‌తో  రీమేక్‌ చేయాలని నిర్మాత మధు ఉబలాటపడుతున్నాడు. ఈ చిత్రాన్ని ఆల్‌రెడీ పవన్‌కల్యాణ్‌కు చూపించి డేట్స్‌ అడిగినప్పటికీ ఆయన ఈ చిత్రాన్ని చేసేందుకు నిరాకరించాడు. తాజాగా ఈ చిత్రాన్ని యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌తో రీమేక్‌ చేయడానికి మధు సిద్దమవుతున్నట్లు, ఎన్టీఆర్‌ కూడా ఈ చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక మడత పేచీ ఉంది.

ఈ చిత్రం కథ ఏమిటంటే... కొందరు రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలు కలిసి పేదరైతులు భూములు లాక్కోవాలని, ఏకంగా ఊరిని మొత్తం కబ్జా చేయాలని భావిస్తారు. దానికి హీరో ఎదురుతిరిగి ఆ ఊరి రైతులందరి తరపున పోరాడి విజయం సాధిస్తాడు. ఈ స్టోరీలైన్‌ వింటుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం వంకతో రైతుల భూములు లాక్కోవాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. దానికి అక్కడ భూములున్న  రైతులు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. సో... ఈ చిత్ర  కథకి, ఆంద్రప్రదేశ్‌ రాజకీయాలకు ఇది మిళితం కావడంతో ఎన్టీఆర్‌ నేటి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని త్వరలో తన ‘కత్తి’పవర్‌తో సమాధానం ఇవ్వడానికి, తన సత్తా చూపించడానికి ఎన్టీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తోంది.

jr ntr
chandrababu
kaththi movie remake
andhra pradesh
land mafia
jr ntr vs chandrababu